https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2019//Dec//20191209//Hyderabad//637114790839728371.jpg

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు హైకోర్టు విచారణ

హైదరాబాద్: పోలీస్ కస్టడీలో ఉన్న దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై సోమవారం హైకోర్టు విచారణ జరపనుంది. కస్టడీలో ఉన్న నిందితులను ఎన్‌కౌంటర్‌ ఎలా చేస్తారని మహిళ సంఘాలు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌‌ చేయడాన్ని మహిళ సంఘాలు తప్పు పట్టాయి. మృత దేహాల అప్పగించే వ్యవహారంపై కూడా న్యాయస్థానం ఇవాళ నిర్ణయం తీసుకోనుంది. కాగా గత విచారణలోని హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మృత దేహాలను మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్‌లో భద్రత పరిచారు.