https://www.ntnews.com/updates/latestnews/2019/killsbrother.jpg

ఆస్తికోసం అన్నావదినలు కలిసి సొంత తమ్ముడినే..

అంబర్‌పేట: ఆస్తి కోసం అన్నా-వదినలు కలిసి సొంత తమ్ముడినే హతమార్చిన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో పరిధిలో చోటుచేసుకుంది. హత్య కేసులో అన్నావదినలు ఇద్దరిని నల్లకుంట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ కె.మురళీధర్ తెలిపిన వివరాల ప్రకారం...నల్లకుంట బాయమ్మ గల్లీలో వెంకటేశ్, రమేశ్‌ అనే ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఇంట్లో పక్కపక్క గదుల్లో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా వీరిద్దరూ ఆస్తి విషయమై గొడవపడుతున్నారు. ఈ నెల 5వ తేదీ గురువారం రమేశ్‌ తాగిన మత్తులో తన గదిలో నిద్రపోతుండగా అతని మెడకు నైలాన్ తాడు బిగించి అతని అన్న వెంకటేశ్, వదిన బబిత కలిసి హత్య చేశారు. హత్య చేసిన విషయాన్ని వారు పోలీసుల ముందు అంగీకరించారు. దీంతో నిందితులైన వెంకటేశ్, బబితలను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.