https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/12/9/snake.jpg?itok=aaKfVRqI

మైదానంలో పాము.. నిలిచిపోయిన మ్యాచ్‌

సాక్షి, అమరావతి: విజయవాడలోని మూలపాడులో సోమవారం నుంచి క్రికెట్‌ సందటి మొదలైంది. ఆంధ్ర- విదర్భ జట్ల మధ్య రంజీ మ్యాచ్‌ జరుగుతోంది. అయితే మ్యాచ్‌ ప్రారంభమైన కొద్ది సమయానికి ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ సాగుతున్న సమయంలో మైదానంలోకి ఓ పాము ప్రవేశించింది. దీంతో నిర్వహకులు మ్యాచ్‌ను మధ్యలోనే కొద్ది సమయం పాటు  ఆటను నిలిపివేశారు. పామును మైదానం నుంచి బయటకు పంపుటకు అక్కడి సిబ్బంది నానా తంటాలు పడ్డారు. ఈ వీడియోను బీసీసీఐ స్వయంగా తన అధికారి ట్విటర్‌ ద్వారా క్రికెట్‌ అభిమానులతో పంచుకుంది. కాగా ఆంధ్ర జట్టుకు టీమిండియా ఆటగాడు హనుమ విహారి, విదర్భ జట్టుకు ఫయాజ్‌ ఫజల్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.

SNAKE STOPS PLAY! There was a visitor on the field to delay the start of the match.

Follow it live - https://t.co/MrXmWO1GFo#APvVID @paytm #RanjiTrophy pic.twitter.com/1GptRSyUHq