టీడీపీ విధానాలనే జగన్‌ అనుసరిస్తున్నాడు: రాఘవులు

ADVT

విజయవాడ: టీడీపీ విధానాలనే జగన్‌ అనుసరిస్తున్నాడని సీపీఎం నేత రాఘవులు పేర్కొన్నారు. తెలుగు మీడియంను రద్దు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందన్నారు. పేదలకు ఇచ్చిన భూములను భూసేకరణ పేరుతో లాక్కోవద్దని రాఘవులు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలన్నారు. మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై డిసెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. మోదీ రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని రాఘవులు విమర్శించారు.