https://www.ntnews.com/updates/latestnews/2019/rtcjac2911.jpg

తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ జేఏసీ క్షమాపణలు

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ జేఏసీ క్షమాపణలు చెప్పింది. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ అశ్వథ్థామరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. సమ్మెకు సహకరించిన కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 52 రోజుల సమ్మె సందర్భంగా అసౌకర్యం కలిగినందుకు తెలంగాణ ప్రజలకు, ప్రయాణికులకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. సమ్మె కాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఆర్టీసీ జేఏపీ ప్రగాఢ సానుభూతి తెలిపింది.