పోలీసుల లాఠీ.. రౌడీల చేతికి ఎలా వెళ్లింది?: నిమ్మల రామానాయుడు

ADVT

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడికి డీజీపీ బాధ్యత వహిస్తారా? అని ఆ పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు ప్రశ్నించారు. పోలీసుల లాఠీ.. రౌడీల చేతికి ఎలా వెళ్లిందని నిలదీశారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందన్న డీజీపీ.. జగన్ పర్యటనలో తాము నిరసన తెలిపేందుకు అనుమతి ఇస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటనలో నిరసన తెలపడానికి... వైసీపీ వాళ్లకు ఎలా అనుమతి ఇచ్చారని రామానాయుడు నిలదీశారు.