పుట్టపర్తిలో విదేశీ మహిళకు కుచ్చు టోపీ

ADVT

అనంతపురం: విదేశీ మహిళకు కుచ్చు టోపీ పెట్టిన ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరిగింది. సత్యసాయి భక్తుడు రాజేష్ సక్సేనా విదేశీ మహిళ నుంచి రూ. 27 లక్షలు స్వాహా చేశాడు. మోసపోయినట్లు గ్రహించిన ప్రాన్స్ దేశస్తురాలు కేథరిన్.. కన్నీటి పర్యంతమవుతూ.. తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ సత్య ఏసు బాబుకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు అందవలసి ఉంది.