బొత్సకు శ్మశాన వైరాగ్యం వచ్చింది: కాల్వ శ్రీనివాసులు

ADVT

అమరావతి: చంద్రబాబు బస్సుపై రైతులు, రియల్టర్లు దాడి చేశారని చెప్పడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. నిన్నటి ఘటన వైసీపీ గూండాల పనేనన్నారు. బొత్స సత్యనారాయణకు ఆరు నెలల్లోనే శ్మశాన వైరాగ్యం వచ్చిందని కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. పేరుకు పదవులు ఇచ్చి బీసీ మంత్రులను కీలుబొమ్మలుగా మార్చారన్నారు. డీజీపీ తక్షణమే తన మాటలను వెనక్కి తీసుకోవాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.