https://www.ntnews.com/updates/latestnews/2019/coach.jpg

ఐడీ కార్డు ఇవ్వ‌లేద‌ని.. రైలుకు నిప్పు అంటించాడు

హైద‌రాబాద్‌: ఉత్త‌రాఖండ్‌లో ఓ వ్య‌క్తి రైలుకు నిప్పు అటించాడు. త‌న‌కు ఐడీ కార్డు ఇవ్వ‌లేద‌ని అత‌ను అలా చేశాడు. రిషికేశ్‌-ఢిల్లీ ప్యాసింజ‌ర్ రైలుకు ఆ ఉన్మాది నిప్పు అంటించిన‌ట్లు తెలుస్తోంది. హ‌రిద్వార్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. నాకు ఐడీ కార్డు ఇవ్వ‌లేదు, అందుకే రైలు బోగీకి నిప్పు అంటించాను, సీట్ల‌ను చించేశాను అని ఆ నిందితుడు తెలిపాడు. నిందితుడికి ఏదైనా క్రిమిన‌ల్ రికార్డు ఉందా లేదా అని పోలీసులు విచారిస్తున్నారు.