https://www.ntnews.com/updates/latestnews/2019/3-jio-fiber.jpg

రూ.351, రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసిన జియో ఫైబర్

జియో ఫైబర్ తన బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం రెండు నూతన ప్రీపెయిడ్ ప్లాన్లను తాజాగా లాంచ్ చేసింది. రూ.351, రూ.199లకు ఈ రెండు ప్లాన్లు జియో ఫైబర్ కస్టమర్లకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే వినియోగదారులు తాము వాడుతున్న ఇతర ప్లాన్లలో ఉండే డేటా అయిపోతేనే ఈ రెండు ప్లాన్లను ఉపయోగించుకునేందుకు వీలు కలుగుతుంది. ఇక ఈ ప్లాన్లలో రూ.351 ప్లాన్‌లో కస్టమర్లకు 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 50జీబీ డేటా, కాంప్లిమెంటరీ టీవీ వీడియో కాలింగ్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులుగా ఉంది. అలాగే రూ.199 ప్లాన్‌లో కస్టమర్లకు 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ కాలింగ్, కాంప్లిమెంటరీ టీవీ వీడియో కాలింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 7 రోజులుగా నిర్ణయించారు.