https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2019//Nov//20191129//Hyderabad//637106242591399625.jpg

నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్

ADVT

తిరుపతి: నూతన సంవత్సర ఆంగ్ల క్యాలెండర్లను టీడీపీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో క్యాలెండర్‌ను బుక్ చేసుకుంటే వెంటనే వారికి అందజేస్తామన్నారు. త్వరలోనే శ్రీవారి డైరీలను అందుబాటులోకి తెస్తామన్నారు. శ్రీరంగం తరహాలో తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచాలా లేదా అన్న విషయంపై ఆగమ సలహాదారులతో చర్చిస్తున్నామన్నారు. ఆర్జిత సేవల రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. భారమైనా సరే దూపదీపనైవేధ్యాలకు నోచుకోని ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకుంటామన్నారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్మా ట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ నుంచి దేశంలోని అన్ని టీటీడీ సమాచార కేంద్రాలలో క్యాలెండర్లు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు.