https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2019//Nov//20191129//Hyderabad//637106219857922282.jpg

అందుకే మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు: దేవినేని ఉమా

ADVT

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్‌కు ఇంత అసహనం ఎందుకని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పరిపాలన వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు.. మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్‌ అభద్రతాభావంతో ఉన్నారని, ప్రజల్లో వైసీపీ ప్రభుత్వ గ్రాఫ్‌ పడిపోయిందని ఆయన విమర్శించారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రసంగానికి అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. దీనిబట్టి చూస్తే వైసీపీ ఎంపీలు ఎంత దిగజారిపోయారో తెలుస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేతకాని తనం వల్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని దేవినేని ఉమా ఆరోపించారు.

 

చంద్రబాబును బూతులు తిడితే వారికి పేరు వస్తుందని.. వైసీపీ మంత్రులు అనుకుంటున్నారని దేవినేని ఉమా అన్నారు. అమరావతిని చంపే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తెలుగు ప్రజల ఆకాంక్షను ఎందుకు చంపుతున్నారని ఆయన నిలదీశారు. రాళ్లు వేసే విష సంస్కృతికి తెరలేపారని మండిపడ్డారు. వైసీపీ మంత్రులు మాట్లాడిన ప్రతి మాట జగన్‌ అంతరంగమేనని, బాబుని తిట్టించి జగన్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారని దేవినేని ఉమా విమర్శించారు.